మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు

Court granted bail for former minister Kollu Ravindra
  • మచిలీపట్నంలో వైసీపీ నేత హత్య
  • కొల్లు రవీంద్రపై ఆరోపణలు
  • రాజమండ్రి జైల్లో ఉన్న కొల్లు
మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఎట్టకేలకు బెయిల్ అభించింది. ఈ మేరకు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. మోకా భాస్కరరావు హత్యకేసులో అరెస్ట్ అయిన కొల్లు రవీంద్ర ప్రస్తుతం రాజమండ్రి కారాగారంలో ఉన్నారు.
Go Back to Shorts
Kollu Ravindra
Bail
Court
Machilipatnam
Murder

More Telugu News