జాతిపిత కళ్లజోడుకు కళ్లు చెదిరే ధర!
- 1920లో ఓ దక్షిణాఫ్రికా వ్యక్తికి తన కళ్లజోడు ఇచ్చిన గాంధీజీ
- ఆ వ్యక్తి నుంచి తర్వాతి తరాలకు సంక్రమించిన కళ్లజోడు
- వేలంలో రూ.2.5 కోట్లకు అమ్ముడైన వైనం
మహాత్ముడు 1920లో దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో బ్రిటీష్ పెట్రోలియం సంస్థలో పనిచేసే ఓ వ్యక్తికి ఆ కళ్లజోడును ఇచ్చారు. ఆ వ్యక్తి నుంచి అతని తర్వాతి తరం వ్యక్తులకు అవి సంక్రమించాయి. ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి ఆ కళ్లజోడుతో పెద్దగా ఉపయోగం లేదని, పారేయాలని భావించి, ఆ తర్వాత మనసు మార్చుకుని బ్రిటన్ లోని వేలం సంస్థకు పంపాడు. ఇప్పుడా కళ్లజోడే అతడిని కోటీశ్వరుడ్ని చేసింది.