Mahmood Ali: నాకు ఉబ్బసం ఉండడంతో కరోనా సోకగానే భయం వేసింది: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ

  • ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న మహమూద్ అలీ
  • ఎంతో ధైర్యంగా పోరాడానని వెల్లడి
  • ప్లాస్మా దానం చేయాలంటూ పిలుపు
Telangana home minister Mahmood Ali explains his corona experience

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కూడా కరోనా బారినపడి, ఆ మహమ్మారిని జయించి మళ్లీ ఆరోగ్యం సంతరించుకున్నారు. అయితే, తనకు ఉబ్బసం వ్యాధి ఉండడంతో కరోనా సోకగానే ఎంతో భయపడ్డానని వెల్లడించారు. అయినప్పటికీ ధైర్యంగా ఆ వైరస్ తో పోరాడి విజయం సాధించానని తెలిపారు. హైదరాబాదులో జరిగిన ప్లాస్మా దానం అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. ప్లాస్మా దానం చేయడం వల్ల జీవితాలను కాపాడవచ్చని మహమూద్ అలీ పిలుపునిచ్చారు. దేశంలో తెలంగాణలోనే కరోనా మరణాల రేటు తక్కువగా ఉందని తెలిపారు.

More Telugu News