దారుణంగా పడిపోయిన పసిడి దిగుమతులు
- ఏప్రిల్-జులై మధ్య 81.22 శాతం క్షీణించిన దిగుమతులు
- అదుపులోకి వచ్చిన వాణిజ్య లోటు
- భారత్ నుంచి ఆభరణాల ఎగుమతుల్లోనూ దారుణ క్షీణత
నిజానికి మార్చి నుంచే పసిడి దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి మార్చిలో బంగారం దిగుమతులు 62.6 శాతం, ఏప్రిల్లో 99.93 శాతం, మేలో 98.4 శాతం, జూన్లో 77.5 శాతం తగ్గాయి. జులైలో మాత్రం స్వల్పంగా పుంజుకుని 4.17 శాతం పెరిగాయి. మరోవైపు, బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడంతో అమ్మకాలు కూడా పడిపోయాయి. గతేడాది ఏప్రిల్-జులై మధ్యతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో భారత్ నుంచి ఆభరణాల ఎగుమతులు 66.36 శాతం తగ్గి 417 కోట్ల డాలర్లకు పడిపోయాయి.