సెప్టెంబరు 1 నుంచి రొటేషన్ పద్ధతిలో పనిచేయనున్న ఢిల్లీ హైకోర్టు
- కరోనా కారణంగా మార్చి 25న మూతపడిన కోర్టు
- ఢిల్లీలోని ఏడు జిల్లా కోర్టులను తెరవాలని హైకోర్టు నిర్ణయం
- నాలుగో వంతు సిబ్బందితో కార్యకలాపాలు
అలాగే, కోర్టులలోని మొత్తం సిబ్బందిలో నాలుగో వంతు మంది మాత్రమే పనిచేసేందుకు అవకాశం ఉందని, ఇది ఒక ప్రయోగమని హైకోర్టు రిజిస్ట్రార్ మనోజ్ జైన్ పేర్కొన్నారు. నాలుగో వంతు సిబ్బందితో కోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయని, మిగతా కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించవచ్చన్నారు. కరోనా కారణంగా మార్చి 25న మూతపడిన కోర్టులు జూన్లో లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత వీడియో కాన్ఫరెన్సింగ్ విధానం ద్వారం కేసులను విచారిస్తున్నాయి.