River Godavar: ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరద.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

  • ఇంద్రావతి, కాళేశ్వరం నుంచి పెద్ద ఎత్తున వరద
  • నీటి మట్టం మరో ఐదు అడుగులకు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక
  • లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
River Godavari at Danger level at Bhadrachalam

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ ఉదయం ఆరు గంటల సమయానికి నీటిమట్టం 48.1 అడుగులకు చేరుకుంది. నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు, నేడు నీటి మట్టం మరింత పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

నీటి మట్టం మరో 5 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వరద తాకిడికి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో ఆ ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఎగువ ప్రాంతాలైన ఇంద్రావతి, కాళేశ్వరం నుంచి వరద నీరు పోటెత్తుతుండడంతోనే భద్రాచలం వద్ద గోదావరికి భారీ స్థాయిలో నీరు వస్తోందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News