ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరద.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- ఇంద్రావతి, కాళేశ్వరం నుంచి పెద్ద ఎత్తున వరద
- నీటి మట్టం మరో ఐదు అడుగులకు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక
- లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
నీటి మట్టం మరో 5 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వరద తాకిడికి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో ఆ ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఎగువ ప్రాంతాలైన ఇంద్రావతి, కాళేశ్వరం నుంచి వరద నీరు పోటెత్తుతుండడంతోనే భద్రాచలం వద్ద గోదావరికి భారీ స్థాయిలో నీరు వస్తోందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.