యామిని మీద కేసు మంచిది కాదు.. ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి: సోము వీర్రాజు
- అయోధ్య భూమిపూజను ప్రసారం చేయని టీటీడీ
- సర్వత్ర వెల్లువెత్తుతున్న విమర్శలు
- విమర్శించిన యామినిపై కేసు నమోదు
అయోధ్యలోని రామాలయం శంకుస్థాపన శతాబ్దాల కల అని వీర్రాజు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలోని 250 ఛానల్స్ ప్రత్యక్షప్రసారం చేశాయని తెలిపారు. కానీ, కలియుగ దైవం అయిన శ్రీవెంకటేశ్వరస్వామి యొక్క టీటీడీ ఛానల్ ప్రసారం చేయలేదంటే... ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తలచుకుంటేనే మనసుకి బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు బీజేపీ నేతలు ఇప్పటికే ఈ అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు. యామిని మీద కేసు పెట్టడం మంచిది కాదని... ఈ కేసును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.