Tirumala: తిరుమలలో పరకామణి భవన నిర్మాణానికి భూమి పూజ

  • రూ. 9 కోట్లతో నూతన భవన నిర్మాణం
  • భూమి పూజ చేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
  • పూర్తి హంగులతో భవన నిర్మాణం
TTD built new Parakamani Bhavan In Tirumala

తిరుమలలో పరకామణి నిర్వహిస్తున్న ప్రస్తుత ప్రాంగణంలో సరైన వసతులు లేకపోవడంతో నూతన భవన నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది. సిబ్బంది ఇబ్బందులు తీర్చే ఉద్దేశంతో ఆలయానికి సమీపంలో రూ. 9 కోట్లతో అన్ని హంగులతో కొత్త భవనాన్ని నిర్మించాలని పాలక మండలి నిర్ణయించింది. ఇందులో సిబ్బంది కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గదులు, స్ట్రాంగ్ రూమ్, డొనేషన్ల కౌంటర్, బ్యాంకు కౌంటర్లు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. నూతన భవనానికి ఈ ఉదయం టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భూమి పూజ చేశారు.

  • Loading...

More Telugu News