గుండెపోటుతో కన్నుమూసిన ఏపీ మాజీ మంత్రి డాక్టర్ ఖలీల్ బాషా
- ఇటీవల కరోనా నుంచి కోలుకున్న బాషా
- ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి
- ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా సేవలు
గత నెల 30న కరోనా బారినపడిన డాక్టర్ బాషా హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన కరోనా నుంచి బయటపడ్డారు. అయితే, మూడు రోజుల క్రితం గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.