వర్షాకాలం ముగిసే వరకు కోజికోడ్లో భారీ విమాన రాకపోకలపై నిషేధం
- ఈ నెల 7న రాత్రి ల్యాండ్ అవుతూ ప్రమాదానికి గురైన విమానం
- పైలట్, కోపైలట్ సహా 20 మంది మృతి
- అధిక వేగమే ప్రమాదానికి కారణమంటున్న నిపుణులు
వర్షాల కారణంగా రన్వే చిత్తడిగా ఉండడంతో జారి లోయలోకి దూసుకెళ్లి రెండు ముక్కలైంది. ప్రమాదంలో పైలట్, కో పైలట్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వర్షాకాలం ముగిసే వరకు ఈ విమానాశ్రయంలో విమాన రాకపోకలను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, విమానం నిర్ధారిత వేగానికి మించిన వేగంతో ల్యాండ్ కావడమే ప్రమాదానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.