Pakistan: పాకిస్థాన్ లో గ్రెనేడ్‌ ఎటాక్‌ చేసింది తామేనని ప్రకటించిన సిందూదేశ్ రివల్యూషనరీ ఆర్మీ

  • పాక్ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్ పై నిన్న దాడి
  • ఐదుగురి మృతి.. పది మందికి తీవ్ర గాయాలు
  • తమ భూమిపై పాక్ పెత్తనాన్ని మానుకోవాలని డిమాండ్
Sindhudesh Revolutionary Army claims they attacked Pakistan Rangers Headquarters

పాకిస్థాన్ లోని జకోబాబాద్, శిఖర్పూర్ లోని పాక్ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్ పై గ్రెనేడ్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఈ దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరనే విషయం తొలుత తెలియరాలేదు. తాజాగా, తామే ఈ దాడికి పాల్పడినట్టు సిందూదేశ్ రివల్యూషనరీ ఆర్మీ ప్రకటించింది.

గత నెలలో కూడా ఈ రివల్యూషనరీ ఆర్మీ ఈ తరహా దాడులకు పాల్పడింది. అయితే ఆ దాడుల్లో రేంజర్లు ప్రాణాలు కోల్పోనప్పటికీ.. గాయాలపాలయ్యారు. సింధ్ ప్రాంతంపై పాకిస్థాన్ ప్రభుత్వం పెత్తనాన్ని మానుకోవాలని సిందూదేశ్ రివల్యూషనరీ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. పాకిస్థాన్ నుంచి తమకు విముక్తి కలిగేంత వరకు పోరాటం ఆగదని ఈ సందర్భంగా ప్రకటించింది.

More Telugu News