Chiranjeevi: 'చిన్న చేపల వేపుడు' వీడియోను వాయిదా వేసిన చిరంజీవి

  • చింత తొక్కుతో చేపల వేపుడు అంటూ ట్వీట్ చేసిన చిరు
  • సాయంత్రం వీడియో రిలీజ్ చేస్తానని వెల్లడి
  • అయితే, విజయవాడ ప్రమాదంతో కలత చెందానని వివరణ
Chiranjeevi postponed his fish fry recipe video in the wake of Vijayawada tragedy

ఇటీవలే సోషల్ మీడియాలో ప్రవేశించిన మెగాస్టార్ చిరంజీవి నిత్యం ఎంతో సందడి చేస్తున్నారు. ఓవైపు సరదా, మరోవైపు సామాజిక స్పృహ... ఈ విధంగా ఆయన సోషల్ మీడియా లైఫ్ సాగిపోతోంది. ఈ ఉదయం ఆయన చేసిన ట్వీట్ అభిమానుల నోరూరించిందంటే అతిశయోక్తి కాదు. "చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు ఈ సాయంత్రం 4 గంటలకు!" అంటూ చిన్న టీజర్ వదిలారంతే... అభిమానులు వేల రీట్వీట్లు, లైకులతో మోత మోగించారు. అయితే ఈ వీడియో విడుదల కార్యక్రమాన్ని చిరంజీవి వాయిదా వేసుకున్నారు. అందుకు కారణమేంటో చిరంజీవి మాటల్లోనే చూద్దాం! "విజయవాడలో జరిగిన విషాద ఘటనతో కలత చెందాను. అందుకే ఈ వీడియోను ఇవాళ పోస్టు చేయడంలేదు" అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.


More Telugu News