Alla Nani: అగ్ని ప్రమాద ఘటనపై పూర్తి విచారణ జరపాలని జగన్ ఆదేశించారు: ఆళ్ల నాని

  • మృతిచెందిన వారికి సంతాపం 
  • అధికారులను అప్రమత్తం చేశాం
  • సహాయకచర్యలు కొనసాగుతున్నాయి
alla nani orders probe into vijayawada fire accident

విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామని, సహాయకచర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని తాము వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించామని ఆళ్ల నాని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని, నివేదిక సమర్పించాలనిసీఎం వైస్ జగన్ ఆదేశించారని తెలిపారు. ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందని చెప్పారు.  అనంతరం ఆయన ప్రమాద స్థలికి బయలుదేరారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే మంత్రి సుచరిత పర్యటించారు.

More Telugu News