ప్రభుత్వం చెబుతున్నట్టుగా సచివాలయాల వద్ద కొనుగోళ్లు జరగడంలేదు: లోకేశ్
- ఉల్లిరైతులను ఆదుకోవాలన్న లోకేశ్
- మద్దతు ధర లేదని వెల్లడి
- ఉల్లిరైతుకు కన్నీరే మిగిలిందని ఆవేదన
ఉల్లిపంటల అమ్మకాలకు ప్రధాన మార్కెట్ కేంద్రమైన కర్నూలు మార్కెట్ యార్డు కరోనా తీవ్రత కారణంగా మూతపడిందని, ప్రభుత్వం చెబుతున్నట్టుగా సచివాలయాల వద్ద కొనుగోళ్లు జరగడంలేదని వెల్లడించారు. రాష్ట్ర సర్కారు వెంటనే స్పందించి ఉల్లిపంటలను రైతుల వద్ద నుండి వారి గ్రామంలో కొనుగోలు చేయాలని, మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.