కరోనా నుంచి కోలుకున్న నర్సు సునీతతో మాట్లాడాను... ఆమె మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం: నాగచైతన్య
- ఫేస్ బుక్ లో శేఖర్ కమ్ముల చర్చా కార్యక్రమం
- కరోనాను జయించిన వ్యక్తులతో చర్చ
- ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న నాగచైతన్య
దీనిపై నాగచైతన్య స్పందిస్తూ, సునీత అనే నర్సుతో గతవారం మాట్లాడానని, ఆమె మాటలు ఎంతో స్ఫూర్తి కలిగించే విధంగా ఉన్నాయని, ఇతరులకు ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. కరోనా సోకిందని తెలియగానే భయపడతారని, వాస్తవానికి ఈ భయం వల్లనే అనేక సమస్యలు వస్తుంటాయని అన్నారు. వైరస్ సోకిన విషయం కూడా ఈ భయంతోనే బయటికి చెప్పుకోలేక పోతున్నారని, ఈ పరిస్థితి ప్రాణాల మీదికి తెస్తోందని నాగచైతన్య అభిప్రాయపడ్డారు. కరోనాపై పోరాటంలో ముందు భయాన్ని జయించాలని స్పష్టం చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా దర్శకుడు సుకుమార్ ను నామినేట్ చేశారు.