Rahul Gandhi: మేలోనే చైనా ఆర్మీ దుందుడుకు చర్యలు.. మోదీ అసత్యాలు చెప్పారన్న రాహుల్ గాంధీ

  • చైనాతో నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించిన రాహుల్
  • గాల్వ‌న్ లోయ వద్ద ఘర్షణకంటే ముందే చైనా దూకుడు
  • మే నెలలో తూర్పు ల‌డ‌ఖ్‌ ప్రాంతంలోకి చైనా ఆర్మీ
  • కూగ్రంగ్ నాలా, గోగ్రా, పాన్‌గంగ్ సో ప్రాంతాల్లోకి చైనా సైనికులు
why is modi lying asks rahul

చైనాతో సరిహద్దుల్లో ఇటీవల నెలకొన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. జూన్ 15వ తేదీన గాల్వ‌న్ లోయ వద్ద చైనా-భారత్ సైనికుల మధ్య జరిగిన ఘ‌ర్ష‌ణ కంటే నెల రోజుల ముందే మే నెలలో తూర్పు ల‌డ‌ఖ్‌ ప్రాంతంలోకి చైనా ఆర్మీ ప్ర‌వేశించిన‌ట్లు తెలుపుతూ వచ్చిన ఓ వార్తను రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు.

ఎల్‌ఏసీ వద్ద భారత భూభాగాన్ని చైనా ద‌ళాలు ఆక్ర‌మించాయని భారత ర‌క్ష‌ణ‌శాఖ మాత్రం ఆ నిజాన్ని దాచిందని రాహుల్ చెప్పారు. కూగ్రంగ్ నాలా, గోగ్రా, పాన్‌గంగ్ సో ప్రాంతాల్లోకి మే నెల 17, 18వ తేదీల్లో చైనా ఆర్మీ వ‌చ్చిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ తెలిపిందని ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఈ విషయంపై ప్ర‌ధాని ఎందుకు అసత్యాలు చెబుతున్నార‌ని ఆయన ప్రశ్నించారు.

More Telugu News