Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి భారత్ లోనే నిర్మాణం జరుపుకుంటోందని తెలుసా?

Worlds highest railway bridge under construction on Chenab river
  • జమ్మూకశ్మీర్ లో భారీ వంతెన నిర్మాణం
  • చీనాబ్ నదిపై వంతెన
  • బారాముల్లా, శ్రీనగర్ ప్రాంతాలను జమ్మూతో అనుసంధానం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన జమ్మూ కశ్మీర్ లో నిర్మాణం జరుపుకుంటోంది. ఈ వంతెన ద్వారా శ్రీనగర్, బారాముల్లా ప్రాంతాలు జమ్మూతో అనుసంధానం అవుతాయి. చీనాబ్ నదిపై నిర్మితమవుతున్న ఈ భారీ రైల్వే బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు. పారిస్ లో ఉన్న సుప్రసిద్ధ చారిత్రక కట్టడం ఈఫిల్ టవర్ (324 మీటర్లు) కంటే ఈ వంతెన ఎంతో ఎత్తయినది. ప్రపంచంలో ఈ స్థాయి వంతెన మరొకటి లేదు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచినా చెక్కుచెదరని విధంగా అత్యంత పటిష్టంగా ఈ వారధి నిర్మాణం సాగుతోంది.

దీని పొడవు 1,315 మీటర్లు. పేలుళ్లు, భూకంపాలను తట్టుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఈ వంతెనపై రైళ్లు గరిష్టంగా 100 కిమీ వేగంతో ప్రయాణించే వీలుంది. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ సంకోచించని లోహాలను, పదార్థాలను దీని నిర్మాణంలో వినియోగించారు.

అంతేకాదు, ఈ ప్రాంతంలో గాలి వేగం 90 కిలోమీటర్లు దాటితే ఆటోమేటిగ్గా ఈ బ్రిడ్జిపై రెడ్ సిగ్నల్ లైట్ వెలుగుతుంది. ఈ బ్రిడ్జి రూపకల్పలో డీఆర్డీఓ పాత్ర కూడా ఉంది. ఈ వంతెనకు దన్నుగా నిలుస్తున్న 17 స్తంభాల్లో ఒక్కటి పడిపోయినా వంతెన దృఢంగా నిలిచే ఉండేలా డీఆర్డీఓ సూచనలు అందించింది. ఇది 2022 నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
Bridge
Railway
Chenab River
Worlds Highest
Jammu And Kashmir
India

More Telugu News