ప్రకాశం జిల్లా మరణాలపై కారణాలు వెలికి తీయాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan demands AP Government the causes of Kurichedu deaths should be ascertained
ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్లు తాగి 9 మంది మరణించిన ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మత్తు కోసం నాటు సారా, శానిటైజర్ కలిపి తాగినట్టు తెలుస్తోందని, కురిచేడు మరణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి కారణాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మద్యానికి బానిసలైన వాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. నాటు సారాను అరికట్టడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

మద్యం దుకాణాలను తెరిచి ఉంచే సమయం మరో గంట సేపు పొడిగించడం చూస్తుంటే ప్రభుత్వానికి మద్యనిషేధంపై చిత్తశుద్ధి లేదన్న విషయం అర్థమవుతోందని విమర్శించారు. కురిచేడులో మరణించిన వారు పేద కుటుంబాలకు చెందినవారేనని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Pawan Kalyan
Kurichedu
Deaths
Sanitizer
Prakasam District
YSRCP
Andhra Pradesh

More Telugu News