Andhra Pradesh: ఆగస్టు 5న తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావాలని కోరిన కేంద్రం

AP and Telanagana states chief ministers will be meet on water disputes
ఇటీవల తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపుల అంశంపై అనేక వివాదాలు తలెత్తాయి. ఈ జల ఫిర్యాదులపై కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ స్పందించింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆగస్టు 5న సమావేశం ఏర్పాటు చేయాలని అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఏపీ, తెలంగాణ సీఎస్ లకు సమావేశం గురించి లేఖ రాశారు. ఆగస్టు 5న సమావేశం ఏర్పాటు చేశామని, ఆ రోజున సీఎంలు అందుబాటులో ఉంటారా, లేదా అన్నది తమకు సమాచారం అందివ్వాలని ఆ లేఖలో కోరారు.
Andhra Pradesh
Telangana
KCR
Jagan
Water
Disputes
Krishna
Godavari

More Telugu News