serial killer: వంద హత్యలు చేసిన డెత్ డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ అరెస్ట్

  • ట్రక్, ట్యాక్సీ డ్రైవర్లను హత్య చేసిన దేవేంద్ర శర్మ
  • 125 మందికి అక్రమంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్
  •  హత్య, కిడ్నాప్, చీటింగ్ కేసులు
Doctors arrested in drug service have killed 100 people

వంద మందిని హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న సీరియల్ కిల్లర్ డాక్టర్ దేవేంద్ర శర్మ (62) ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఢిల్లీలోని బాప్‌రైలాలో నార్కోటిక్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన డాక్టర్ శర్మ ట్రక్, టాక్సీ డ్రైవర్లు దాదాపు వందమందిని దారుణంగా హత్య చేశాడు. హత్యల సంఖ్య సెంచరీ మార్కుకు చేరుకోవడంతో ఆ తర్వాత వాటిని ఆపేశాడు. అంతేకాదు, అతడో కిడ్నీరాకెట్ సూత్రధారి కూడా. దేశంలోని పలు రాష్ట్రాల్లోని కిడ్నీ రాకెట్‌తో సంబంధాలున్నాయి. వైద్యం కోసం తన వద్దకు వచ్చిన వారి నుంచి వారికి తెలియకుండా కిడ్నీలు తొలగించి విక్రయించేవాడు. ఇలా దాదాపు 125 మందికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశాడు. ఒక్కో కేసులో రూ. 5 నుంచి రూ. 7 లక్షల వరకు వసూలు చేసేవాడు. 

ఓ హత్య కేసులో పట్టుబడి జీవిత ఖైదు అనుభవిస్తున్న డాక్టర్ శర్మ ఈ ఏడాది జనవరిలో 20 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చి ఢిల్లీలోని బాప్‌రైలాకు పారిపోయి దాక్కున్నాడు. అక్కడ ఓ వితంతువును పెళ్లాడి ఆమెతో ఉంటున్నాడు. అతడి కోసం గాలిస్తున్న జైపూర్ పోలీసులకు శర్మ గురించి ఈ విషయాలు తెలిశాయి. దీంతో వారు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించగా వారు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

బీఏఎంఎస్ మాత్రమే చదివిన దేవేంద్రశర్మ కిడ్నీలు తొలగించడంలో మహా దిట్ట. ట్రక్ డ్రైవర్లను చంపి వారి మృతదేహాలను కాస్గంజ్ సమీపంలోని హజా కాలువలో మొసళ్లకు ఆహారంగా వేసి ఆధారాలు మాయం చేసేవాడు. అనంతరం వాహనాలను కాస్గంజ్‌లో అమ్మేవాడు. లేదంటే తుక్కుగా మార్చి మీరట్‌లో అమ్మి సొమ్ము చేసుకునేవాడు. కాగా, ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో నిందితుడిని తీసుకెళ్లేందుకు జైపూర్ పోలీసులు ఢిల్లీ బయలుదేరారు.

శర్మపై పలు చీటింగ్, కిడ్నాప్ కేసులు కూడా నమోదైనట్టు పోలీసులు తెలిపారు. కిడ్నీ రాకెట్ కేసులో 2004లో శర్మతో పాటు పలువురు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News