Andhra Pradesh: ఏపీని వణికిస్తున్న కరోనా... ఈరోజు భారీగా కేసుల నమోదు!

  • 24 గంటల్లో 7,948 కేసుల నమోదు
  • ప్రాణాలు కోల్పోయిన 58 మంది
  • 1,10,297కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
7948 new Corona cases registered in AP in 24 hours

ఏపీలో కరోనా కేసులు రికార్డులను బద్దలు కొడుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా మరో 7,948 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,367 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 1146, గుంటూరు 945, పశ్చిమగోదావరి 757, అనంతపురం 740, కడప 650, చిత్తూరు 452, శ్రీకాకుళం 392, నెల్లూరు 369, ప్రకాశం 335, కృష్ణా 293, విశాఖ 282, విజయనగరం 220 కేసులు నమోదయ్యాయి. మొత్తం 62,979 మంది శాంపుల్స్ ని పరిశీలించినట్టు బులెటిన్ లో అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,10,297కి చేరుకుంది.

గత 24 గంటల్లో 58 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో 11, కర్నూలులో 10, విశాఖలో 9, చిత్తూరులో 5, తూర్పుగోదావరిలో 5, కృష్ణా జిల్లాలో 4, నెల్లూరులో 4, విజయనగరంలో 4, అనంతపురం జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కడప, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,148కి పెరిగింది.

More Telugu News