కశ్మీర్ వేర్పాటువాది గిలానీకి అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన పాకిస్థాన్
- గిలానీకి 'నిషాన్ ఈ పాకిస్థాన్' పురస్కారాన్ని ప్రకటించిన పాక్
- ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది పూర్తవుతున్న తరుణంలో ప్రకటన
- ఇటీవలే హురియత్ నుంచి బయటకు వచ్చిన గిలానీ
మరోవైపు హురియత్ కాన్ఫరెన్స్ నుంచి ఇటీవలే గిలానీ బయటకు వచ్చారు. సంస్థలో తిరుగుబాటుతనం పెరిగిపోయిందని, జవాబుదారీతనం లోపించిందని, అందుకే హురియత్ కు తాను రాజీనామా చేశానని ఆయన తెలిపారు. వాస్తవానికి ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత... దాన్ని ఒక అజెండాగా మార్చడంలో గిలానీ విఫలమయ్యారంటూ పాక్ అసంతృప్తిని ప్రకటించింది. అయితే ఇంతలోనే మనను మార్చుకుని గిలానీకి అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది.