రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం: యనమల
- రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఇప్పటికే అప్పుల భారం
- 2024కు వడ్డీ, అసలు చెల్లింపులకే రూ.లక్ష కోట్లు చెల్లించాలి
- ఏపీ క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోయింది
- ఏపీలో రివర్స్ టెండరింగ్, రివర్స్ గ్రోత్
వైసీపీ నేతల అసమర్థ పాలన కారణంగా ఏపీ క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోయిందని తెలిపారు. ఈ కారణాల వల్ల రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశాలున్నట్లు చెప్పారు. ఏపీలో రివర్స్ టెండరింగ్, రివర్స్ గ్రోత్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని ఆయన చురకలంటించారు.
ఏపీలో భూముల వేలాన్ని బిల్ట్ ఏపీ మిషన్ అని పేర్కొనడం కన్నా బిల్ట్ వైసీపీ మిషన్ అని పేర్కొనడం సబబని ఆయన విమర్శించారు. జగన్ పాలనలో తప్పొప్పులను సమీక్షకు తావు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.