కరోనా సోకిందన్న అనుమానం.. విద్యాశాఖ సూపరింటెండెంట్ ఆత్మహత్య
- కరీంనగర్లో ఘటన
- మంచిర్యాల విద్యాశాఖలో సూపరింటెండెంట్గా విధులు
- ఐదు రోజులుగా జ్వరం, జలుబు
దీంతో తనకు కరోనా సోకి ఉంటుందని అనుమానించిన వెంకటరమణ ఆ రోజు సాయంత్రం వరకు విధులు నిర్వర్తించి, అక్కడి నుంచి ఇంటికి వెళ్లకుండా నేరుగా కరీంనగర్లో తన ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం విధులకు వెళ్లిన తండ్రి రాత్రయినా ఇంటికి రాకపోవడంతో అనుమానించిన ఆయన కుమారుడు విశ్వజిత్ కరీంనగర్లోని బంధువులకు ఫోన్ లో విషయం చెప్పాడు. వారు అతడి ఇంటికి వెళ్లి చూడగా వెంకటరమణ ఉరికి వేలాడుతూ కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.