Kiran: ఎస్సై దాడిలో ప్రాణాలు కోల్పోయిన దళిత యువకుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్

  • చీరాల ఎస్సై దాడి వల్ల ప్రాణాలు కోల్పోయిన కిరణ్
  • విచారణకు ఆదేశించిన సీఎం
  • ఆందోళనకు సిద్ధమవుతున్న దళిత సంఘాలు
Jagan announces rs 10 laks exgracia to Kiran family

కిరణ్ అనే దళిత యువకుడిపై మూడు రోజుల క్రితం చీరాల ఎస్సై విజయ్ కుమార్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. కిరణ్ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి.

మృతుడి కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం.. 19వ తేదీన తన స్నేహితులతో కలిసి కిరణ్ బైక్ పై బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎస్సై వారిని ఆపి మాస్క్ ధరించకపోవడంతో దాడి చేశాడు. ఈ దాడిలో కిరణ్ స్పృహతప్పి పడిపోయాడు. ఆ తర్వాత అతడిని చీరాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి... అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కిరణ్ చనిపోయాడు. ఈ నేపథ్యంలో, దళిత సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఎస్సై విజయ్ కుమార్ పై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత నేతలు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News