Jagan: సీతానగరం పోలీస్ స్టేషన్ లో యువకుడికి శిరోముండనం ఘటనపై సీఎం జగన్ సీరియస్

CM Jagan serious on Seethanagaram issue where a youth was tonsured in a police station
  • తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు
  • విచారణ జరిపిన డీజీపీ
  • ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ లో వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోసారి ఇలాంటివి జరగరాదని స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ వెంటనే విచారణ జరిపి, ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Jagan
Seethanagaram
East Godavari District
Varaprasad
Tonsure
Police
AP DGP

More Telugu News