ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు... ఒక్కరోజులో 62 మంది మృత్యువాత
- ఏపీలో 758కి చేరిన కరోనా మృతుల సంఖ్య
- కొత్తగా 4,944 పాజిటివ్ కేసులు
- ఇవాళ 1,232 మంది డిశ్చార్జి
ఇక కొత్త కేసులు కూడా తీవ్రస్థాయిలోనే వచ్చాయి. గడచిన 24 గంటల్లో 37,162 శాంపిల్స్ పరీక్షించగా, 4,944 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాదాపు అన్ని జిల్లాల్లో భారీగా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 58,668కి చేరింది. ఇవాళ 1,232 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 32,336 మంది చికిత్స పొందుతున్నారు.