అమూల్ తో చేయి కలిపిన ఏపీ ప్రభుత్వం... మహిళల జీవితాలు మారిపోతాయన్న సీఎం జగన్
- మహిళా పాడిరైతులు ఆర్థికంగా ఎదుగుతారన్న సీఎం
- ఒప్పందంపై సంతకాలు చేసిన ఏపీ ప్రభుత్వం, అమూల్
- ఏపీ పాడిరైతులకు మెరుగైన ధర దక్కే అవకాశం
సీఎం జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ప్రభుత్వం తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ సంస్థ తరఫున చెన్నై జోనల్ హెడ్ రాజన్ సంతకాలు చేశారు. కాగా, ఈ ఒప్పందంతో ఏపీ పాడిరైతులకు మెరుగైన ధర దక్కడమే కాకుండా, వినియోగదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలోని సహకార సంఘాల డెయిరీలకు ప్రపంచస్థాయి డెయిరీ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చే వీలుంది. విస్తారమైన మార్కెటింగ్ అవకాశాలు ఏర్పడతాయి.