పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న కేంద్రం.. సచివాలయం కూల్చివేత పనులు మళ్లీ ప్రారంభం!
- సచివాలయం కూల్చివేతకు తొలగిన అడ్డంకులు
- వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
- గంటల వ్యవధిలోనే ప్రారంభమైన కూల్చివేతలు
ఈ నేపథ్యంలో సచివాలయం కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో, కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. సెక్రటేరియట్ ను కూల్చవచ్చని తీర్పును వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే కూల్చివేత పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి.