వెంటలేటర్ పై మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్.. క్షీణించిన ఆరోగ్యం!
- సరిగా పని చేయని ఊపిరితిత్తులు, కాలేయం
- ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన టాండన్
- పరిస్థితి విషమించడంతో ఆందోళనలో కుటుంబసభ్యులు
తన స్వస్థలంలో 10 రోజులు గడిపేందుకు గత నెల 9న లక్నోకు టాండన్ వెళ్లారు. అనారోగ్యానికి గురైన ఆయన జూన్ 11న ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించగా ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. తరువాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రోజుల వ్యవధిలోనే ఆయన మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. టాండన్ అనారోగ్యం నేపథ్యంలో యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మధ్యప్రదేశ్ గవర్నర్ బాధ్యతలను అదనంగా అప్పగించారు.