కేదార్నాథ్ పర్యటనలో నలుగురు యాత్రికుల గల్లంతు.. అడవిలో గాలిస్తున్న మూడు బృందాలు
- డెహ్రాడూన్, నైనిటాల్ జిల్లాల నుంచి యాత్రకు వెళ్లిన యువకులు
- వాసుకీతాల్-త్రియుగీనారాయణ్కు కాలిబాటన వెళ్తూ అదృశ్యం
- గాలింపు చర్యలకు ఆటంకం కలిగిస్తున్న ప్రతికూల వాతావరణం
అయితే రెండు రోజులు గడిచినా ఇంటికి రాకపోవడం, వారి నుంచి ఫోన్లు కూడా రాకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు ప్రయాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మూడు పోలీసు బృందాలు వారు ప్రయాణించినట్టుగా చెబుతున్న అడవి బాటలో గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ సాయం కూడా తీసుకున్నారు. అయినప్పటికీ వారి జాడ కనిపించ లేదు. దీనికితోడు భారీ వర్షం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు గాలింపు చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. అయినప్పటికీ పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.