ICMR: భారత్ లో మానవులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు మొదలయ్యాయి: ఐసీఎంఆర్

  • భారత్ బయోటెక్, జైడస్ కాడిలా సంస్థలకు అనుమతి
  • క్లినికల్ ట్రయల్స్ లో 1000 మందిపై ప్రయోగాలు
  • ఫలితాలపై విపరీతమైన ఆసక్తి
ICMR tells clinical trials for corona vaccine has been started in India

వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్న భారత్ ఆ దిశగా పరిశోధక సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ప్రాథమిక దశను అధిగమించిన భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ కు, జైడస్ కాడిలా హెల్త్ కేర్ తయారు చేసిన మరో వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ కోసం ఆగమేఘాలపై అనుమతులు ఇవ్వడం ఈ కోవలోకే వస్తుంది.

తాజాగా దీనిపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పందించింది. భారత్ లో మానవులపై కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయని వెల్లడించింది. ఓ వ్యాక్సిన్ తయారీకి అత్యంత కీలకంగా భావించే ఈ ప్రక్రియలో దాదాపు 1000 మంది పాల్గొంటున్నారని తెలిపింది.

రెండు దశల్లో జరిగే ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై భారత్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్ లో కరోనా వ్యాక్సిన్ కోసం అనేక పరిశోధనలు జరిగినా, ఇప్పటివరకు ఆశించిన పురోగతి చూపించింది భారత్ బయోటెక్, జైడస్ కాడిలా మాత్రమే. దాంతో ఈ రెండింటికే క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చారు.

More Telugu News