'థ్రిల్లర్' మూవీలో యాక్టర్స్ వీళ్లే: వర్మ
- వరుస చిత్రాలతో హోరెత్తిస్తున్న వర్మ
- తాజాగా 'థ్రిల్లర్' సినిమా ఫొటోలను విడుదల చేసిన ఆర్జీవీ
- ఒడిశాలో నేను కనుగొన్న సరికొత్త టాలెంట్ అని ట్వీట్
ఈ చిత్రంలో అప్సరా రాణి, రాక్ లు జంటగా నటిస్తున్నారు. వీరిద్దరూ ఒడిశాకు చెందిన వారేనని వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు ఒడిశా గురించి బాగా తెలుసని... ఇప్పుడు ఒడిశాలోని సరికొత్త టాలెంట్ ను కనుగొన్నానని చెప్పారు. ఈ ఫొటోలను సూపర్ టాలెంటెడ్ నవీన్ కల్యాణ్ తీశాడని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి పలు ఫొటోలను వర్మ వరుసగా షేర్ చేశారు.