Rufous-bellied: కుమురం భీం జిల్లా అటవీ ప్రాంతానికి వలసొచ్చిన అరుదైన పక్షి!

  • వలసొచ్చిన గద్ద జాతికి చెందిన రూఫస్ బెల్లీడ్‌ పక్షి
  • నందిగాం అటవీ ప్రాంతంలో గుర్తింపు
  • తెలంగాణకు వలస ఇదే తొలిసారి
Rufous bellied bird came to telangana

తెలంగాణలోని కుమురం భీం జిల్లా అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి కనిపించింది. దీనిని గద్ద జాతికి చెందిన రూఫస్ బెల్లీడ్ అనే అరుదైన పక్షిగా గుర్తించారు. పొడవైన రెక్కలు, తోకతో ఆకర్షించేలా ఉన్న ఈ పక్షి జిల్లాలోని పెంచికల్‌పేట మండలం నందిగాం అటవీ ప్రాంతంలోని పాలరాపుగుట్ట ప్రాంతంలో కనిపించింది.

దీనిని గుర్తించిన స్థానిక అటవీ అధికారులు వెంటనే దానిని కెమెరాల్లో బంధించారు. తెలంగాణ ప్రాంతానికి ఈ పక్షి వలస రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఈ పక్షులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లితోపాటు అసోం, పశ్చిమ కనుమలలో కనిపిస్తుంటాయని పెంచికల్‌పేట అటవీ రేంజ్ అధికారి వేణుగోపాల్ తెలిపారు.

More Telugu News