కుమురం భీం జిల్లా అటవీ ప్రాంతానికి వలసొచ్చిన అరుదైన పక్షి!
- వలసొచ్చిన గద్ద జాతికి చెందిన రూఫస్ బెల్లీడ్ పక్షి
- నందిగాం అటవీ ప్రాంతంలో గుర్తింపు
- తెలంగాణకు వలస ఇదే తొలిసారి
దీనిని గుర్తించిన స్థానిక అటవీ అధికారులు వెంటనే దానిని కెమెరాల్లో బంధించారు. తెలంగాణ ప్రాంతానికి ఈ పక్షి వలస రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఈ పక్షులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లితోపాటు అసోం, పశ్చిమ కనుమలలో కనిపిస్తుంటాయని పెంచికల్పేట అటవీ రేంజ్ అధికారి వేణుగోపాల్ తెలిపారు.