నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో నలుగురి మృతి.. బంధువుల ఆందోళన.. ఉద్రిక్తత
- మృతుల్లో ముగ్గురు కరోనా రోగులు
- మూడు గంటలపాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందన్న బంధువులు
- అలాంటిదేమీ లేదన్న కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్
ఆక్సిజన్ అందకపోవడం వల్లే తమవారు చనిపోయారంటూ కరోనా రోగుల బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలోనే ఐసీయూలో సాంకేతిక సమస్య కారణంగా ఆక్సిజన్ సరఫరా శాతం తగ్గిపోయిందని, పునరుద్ధరించేందుకు మూడు గంటలు పట్టడంతోనే వారు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఆక్సిజన్ సరఫరాలో లోపం కారణంగానే రోగులు మరణించారన్న బాధిత బంధువుల ఆరోపణలను కలెక్టర్ నారాయణరెడ్డి ఖండించారు. వారి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కరోనా రోగులు ముగ్గురికీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని, వాటి కారణంగా పరిస్థితి విషమించి చనిపోయారని ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు పేర్కొన్నారు.