Vikas Dubey: వికాస్ దూబే మృతదేహానికి పోస్టుమార్టం... కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు

  • ఎన్ కౌంటర్ లో వికాస్ దూబే హతం
  • దూబేకు కరోనా నెగెటివ్
  • దూబే శరీరంలో నాలుగు బుల్లెట్ గాయాలు
Corona tests conducted for Vikas Dubey dead body

నిన్న ఉజ్జయిని పుణ్యక్షేత్రంలో పోలీసులకు పట్టుబడిన కరుడుగట్టిన నేరస్తుడు వికాస్ దూబే ఈ ఉదయం ఎన్ కౌంటర్ లో హతుడైన సంగతి తెలిసిందే. ఉజ్జయిని నుంచి కాన్పూర్ కు తరలిస్తుండగా, పోలీసులపై దాడికి యత్నించిన దూబేను కాల్చి చంపారు. కాగా, కాన్పూర్ ఆసుపత్రిలో ఈ గ్యాంగ్ స్టర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రక్రియను వీడియోలో బంధించారు. అతడి మృతదేహంలో నాలుగు బుల్లెట్ గాయాలు ఉన్నట్టు గుర్తించారు. కాగా, దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని దూబే మృతదేహానికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే, అతడికి కరోనా సోకలేదని తేలింది.

More Telugu News