ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో భారీగా అరెస్టులు... పోలీసుల అదుపులో సంస్థ సీఈవో, డైరెక్టర్లు
- సంచలనం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ ఘటన
- 15 మంది మృతి
- యాజమాన్య నిర్లక్ష్యమే కారణమంటూ కేసు నమోదు
ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ నిందితులపై 304(2), 338, 285, 337, 284, 278 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈ గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తన పూర్తి నివేదికను నిన్ననే సీఎం జగన్ కు సమర్పించింది. అటు నీరబ్ కుమార్ కమిటీ కూడా యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి దారితీసిందని వెల్లడించింది.