Balineni Srinivasa Reddy: పల్టీలు కొట్టిన ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం.. ఒకరి మృతి

  • మరో ముగ్గురికి తీవ్రగాయాలు
  • హైదరాబాద్ శివారులోని అంబర్ పేట్ వద్ద ప్రమాదం
  • గచ్చిబౌలి నుంచి విజయవాడకి వెళ్తుండగా ఘటన
balineni vehicle meets with accident in hyderabad

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం బొలేరో టైర్ పగిలిపోవడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో వాహనంలో ఉన్న పాపయ్య అనే హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లా పూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్ పేట్ ఔటర్‌ రింగ్ రోడ్డు మీదుగా బాలినేని ఎస్కార్ట్ వాహనం వెళుతోన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

గాయాలపాలయిన వారిని పోలీసులు హయత్ నగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నుంచి వారు విజయవాడకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

More Telugu News