కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టనున్న రాంచరణ్!
- హీరోగా, నిర్మాతగా సక్సెస్ అయిన రాంచరణ్
- డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తున్న చరణ్
- వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు సిద్ధమవుతున్న మెగా హీరో
మరోవైపు, సినిమాలకు దీటుగా డిజిటల్ రంగం దూసుకుపోతోంది. వెబ్ సిరీస్ లు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ తో పాటు అన్ని ప్రాంతీయ భాషల సినీ నిర్మాతలు, దర్శకులు వెబ్ సిరీస్ లపై ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ రాంచరణ్ కూడా డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్న రాంచరణ్... నిర్మాతగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తన తండ్రి చిరంజీవితో మాత్రమే ఆయన సినిమాలను నిర్మించారు. ఇప్పుడు తాజాగా నిర్మాతగా మరో రంగంలోకి అడుగుపెడుతున్నారు. వెబ్ సిరీస్ లను నిర్మించాలనే ఆలోచనలో ఆయన వున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై రాంచరణ్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.