చైనాకు భంగపాటు... భారత్ వ్యతిరేక తీర్మానాన్ని ఐరాసలో అడ్డుకున్న జర్మనీ, యూఎస్!
- కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పై ఉగ్రదాడి
- హేయమైనదిగా అభివర్ణిస్తూ, చైనా ప్రకటన
- ఐరాస ఆమోదించకుండా అడ్డుకున్న అగ్రదేశాలు
ఇటీవల ఒసామా బిన్ లాడెన్ అమర వీరుడని, కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పై ఉగ్రవాదులు చేసిన దాడి వెనుక భారత్ ఉందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్పై దాడి అత్యంత హీనమైనదంటూ, పాక్ మిత్ర దేశం చైనా ఈ ప్రకటనను రూపొందించగా, జర్మనీ, అమెరికా అభ్యంతరం వ్యక్తం చేశాయి.