Rice: తెలంగాణలో పేదలకు ఉచితంగా 10 కిలోల బియ్యం

  • రేపటి నుంచి షురూ
  • జూలై నుంచి నవంబరు వరకు అమలు
  • 2.79 కోట్ల మందికి లబ్ది
Telangana government distributes ten kilo rice to poor

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చింది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు వస్తుండడంతో అనేక కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటికీ పేదలు ఉపాధి దొరక్క అలమటిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూలై నుంచి నవంబరు వరకు పేదలకు 10 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 2.79 కోట్ల మందికి లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఈ కార్యక్రమం రేపటి నుంచి షురూ అవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

More Telugu News