mask: రూ.2.90 లక్షల బంగారంతో ఫేస్ మాస్కు చేయించుకున్న వ్యక్తి.. ఫొటో వైరల్

  • పూణేలో ఘటన
  • బంగారపు మాస్కు ధరించిన  పింప్రి-చింద్వాడ్ వాసి శంకర్
  • శ్వాస తీసుకోవడానికి ఆ మాస్కులకు చిన్న చిన్న రంధ్రాలు
This is what you do when you have more money than sense

కరోనా విజృంభణ నేపథ్యంలో అందరూ మాస్కులు ధరిస్తోన్న విషయం తెలిసిందే. ఎంతటి ధనవంతుడైనా కరోనా బారి నుంచి తప్పించుకోవాలంటే మాస్కులు ధరించాల్సిందే. అయితే, మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఓ ధనవంతుడు మాత్రం బంగారంతో మాస్కు చేయించుకుని వార్తల్లో నిలిచాడు. ఇందుకోసం రూ.2.90 లక్షలు ఖర్చు చేశాడు. శ్వాస తీసుకోవడానికి ఆ మాస్కులకు చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి.

 కాగా, బంగారంతో మాస్కు చేయించుకున్న ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ ఫొటోను పోస్ట్ చేసిన జమ్మూకశ్మీర్ రాజకీయ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శలు గప్పించారు. జ్ఞానం కంటే డబ్బు ఎక్కువగా ఉంటే ఇటువంటి పనులే చేస్తారని చురకలంటించారు.

  • Loading...

More Telugu News