ఇక్కడ ఎవరో అబద్ధం చెబుతున్నారు: రాహుల్ గాంధీ
- లడఖ్ లో పర్యటించిన మోదీ
- పరోక్ష వ్యాఖ్యలు చేసిన రాహుల్
- లడఖ్ వాసుల వీడియో పోస్టు చేసిన కాంగ్రెస్ అగ్రనేత
గాల్వన్ లోయలో ఘర్షణలు జరిగినప్పటి నుంచి రాహుల్ గాంధీ ఇదే తరహాలో ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోదీ మాట్లాడుతూ, మన భూభాగం ఎలాంటి దురాక్రమణలకు గురికాలేదన్నారు. ఈ వ్యాఖ్యలను రాహుల్ తప్పుబట్టారు. ఎలాంటి దురాక్రమణలు జరగకపోతే గాల్వన్ లోయలో ఘర్షణలు జరిగి భారత సైనికులు ఎందుకు చనిపోయారని మోదీని ప్రశ్నించారు.