జగన్ రెడ్డి చెత్త పాలనను ఎండగట్టినందుకు కొల్లు రవీంద్రపై హత్య కేసు పెట్టారు: నారా లోకేశ్
- జగన్ రాజ్యంలో కాదేదీ కేసుకు అనర్హం అంటూ వ్యంగ్యం
- బీసీలను అణచివేస్తున్నారంటూ ఆరోపణలు
- కొల్లు రవీంద్రకు అండగా ఉంటామని వెల్లడి
ఇప్పుడు జగన్ రెడ్డి చెత్త పాలనను, అవినీతిని ఎండగట్టినందుకు కొల్లు రవీంద్రపై హత్య కేసు నమోదు చేశారని ఆరోపించారు. కొల్లు రవీంద్రపై ప్రభుత్వ వేధింపులను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. మరో బీసీ నేతపై వేధింపులు మొదలయ్యాయని, కొల్లు రవీంద్రకు తాము అండగా నిలుస్తామని హ్యాష్ ట్యాగ్ ల రూపంలో లోకేశ్ పేర్కొన్నారు. బంధువర్గానికి రాష్ట్రాన్ని పంచిన జగన్ రెడ్డి బీసీ నాయకత్వాన్ని అణచివేయడమే లక్ష్యంగా కేసులు పెడుతూ, దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.