భారీగా యుద్ధ విమానాలు, ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు
- రష్యా నుంచి మరిన్ని యుద్ధ విమానాల కొనుగోళ్లకు భారత్ సిద్ధం
- మరికొన్ని విమానాల ఆధునికీకరణకు మొగ్గు
రష్యా నుంచి మిగ్-29 ఫైటర్ జెట్ విమానాలు 21, ఎస్ యు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు 12 కొనుగోలు చేయనున్నారు. అంతేకాదు, ఇప్పటికే భారత వాయుసేనలో కొనసాగుతున్న 59 మిగ్-29 విమానాలను ఆధునికీకరించే ప్రతిపాదనకు కూడా రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపింది. నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం అస్త్ర మిసైళ్లను కూడా కొనుగోలు చేయనున్నారు. ఇవి డీఆర్డీవో అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా తయారయ్యాయి.