సాయిసుధ కేసులో కెమెరామెన్ శ్యామ్ కె నాయుడి బెయిల్ రద్దు.. కొత్త కేసు నమోదు
- పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ శ్యామ్ పై ఫిర్యాదు
- తప్పుడు పత్రాలతో బెయిల్ పొందిన వైనం
- ఫోర్జరీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు
తాను, సాయిసుధ ఇద్దరం రాజీకొచ్చామంటూ బెయిల్ కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయనకు బెయిల్ మంజూరైంది. అయితే, కోర్టుకు ఆయన సమర్పించిన పత్రాలు నకిలీవని కోర్టుకు సాయిసుధ తెలిపింది. దీంతో, ఆయన బెయిల్ ను కోర్టు రద్దు చేసింది. అంతేకాదు, ఫోర్జరీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. 'అర్జున్ రెడ్డి' చిత్రం సాయిసుధ మంచి గుర్తింపును తెచ్చుకుంది.