China Products: డ్రాగన్ పై ప్రజాగ్రహం.. 'మేడిన్ చైనా' వస్తువులను తగలబెడుతున్న ఆగ్రా వాసులు!

  • చైనా తీరును నిరసిస్తున్న ఆగ్రా వాసులు
  • చైనా వస్తువులను ఉపయోగించొద్దని పిలుపు
  • నగర కూడళ్లలో చైనా వస్తువుల దగ్ధం
Agra people setting fire to China products

గాల్వన్ లోయలో 20 మంది భారత జవాన్ల ప్రాణాలను చైనా బలిగొన్న నేపథ్యంలో... డ్రాగన్ కంట్రీపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆగ్రా వాసులు చైనా తీరును నిరసిస్తూ... మేడిన్ చైనా వస్తువులను దహనం చేస్తున్నారు. చైనా వస్తువులను బహిష్కరించి, ఆ దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తామని అంటున్నారు. నగరంలోని కూడళ్లలో చైనా వస్తువులను వేసి దగ్ధం చేస్తున్నారు.

చైనాలో తయారైన ఫోన్లు, టీవీలను సైతం తగలబెట్టారు. చైనా వస్తువులను తగలబెట్టడం ద్వారా అమర వీరులకు నివాళి అర్పిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. భారతీయులెవరూ చైనా వస్తువులను ఉపయోగించొద్దని పిలుపునిచ్చారు. దీపావళి నాటికి చైనా వస్తువులు లేకుండా చేయాలని ఈ సందర్భంగా ఆగ్రా మేయర్ కోరారు.

  • Loading...

More Telugu News