Brahmanandam: ఉదయభాను ఛాలెంజ్ ను పూర్తి  చేసిన బ్రహ్మానందం

  • బ్రహ్మానందంకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన ఉదయభాను
  • భాను ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన బ్రహ్మీ
  • గ్రీన్ ఛాలెంజ్ ను ప్రారంభించిన టీఆర్ఎస్ నేత సంతోష్ కుమార్
Brahmanandam takes Udayabhanus challenge

ప్రముఖ యాంకర్ ఉదయభాను విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను హాస్యబ్రహ్మ బ్రహ్మానందం స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ గొప్ప కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు ఉదయభానుకు కృతజ్ఞతలు తెలిపారు.

బ్రహ్మానందకు ఛాలెంజ్ విసిరిన సందర్భంగా ఉదయభాను స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక్క చెట్టు మాత్రమే సృష్టిని కాపాడేందుకు ఒంటి కాలిపై తపస్సు చేస్తుందని భాను తెలిపారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారని ప్రశంసించారు. ప్రకృతి పట్ల తనకున్న బాధ్యతను తమతో పంచున్నారని చెప్పారు. అదే స్ఫూర్తితో మీకు ఈ ఛాలెంజ్ విసురుతున్నానని బ్రహ్మానందంను ఉద్దేశించి చెప్పారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది మొక్కలు నాటాలని ఆశిస్తున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News